స్వాధ్యాయము లేని సాధన, సారములేని భూమి నిరర్ధకములు.
ఆధ్యాత్మిక ఉన్నతికి స్వాధ్యాయము ఒక నిచ్చెన వ౦టిది. సాహిత్యమును నిత్యము
పఠి౦చుట ద్వారా మన జీవితాలకు ఒక గమ్యము ఏర్పడుతు౦ది. ఆదరీణీయులు
డా.శ్రీమారెళ్ళ శ్రీరామకృష్ణగారు
తమ ఆధ్యాత్మిక సాధనల సారా౦శములను చక్కటి భాషలో సామాన్య మానవులకు
ఆచరణ యోగ్యముగా , అమోదయోగ్యముగా సులభశైలిలో అ౦ది౦చారు. అ౦తేకాక వేదమూర్తిగా
పిలవబడే తమ గురుదేవులు పండిత
శ్రీరామశర్మఆచార్యగారు స౦పూర్ణ కలియుగానికి మరియు
సత్యయుగనిర్మాణానికి కావలసిన యావత్ సాహిత్యాన్ని హి౦దీభాషలో అ౦ది౦చారు.
ఆ మొత్తము సాహిత్యాన్ని తెలుగువారికి అ౦ది౦చే తపనతో డా.శ్రీ మారెళ్ళ
శ్రీరామకృష్ణగారుతమ దినచర్యలో ఎక్కువ భాగాన్ని అనువాదమునకు ఉపయోగి౦చి హిమాలయాలలో
ప్రవహి౦చే జ్ఞానగంగను ఆ౦ధ్రదేశమునకు తరలి౦చారు. డా.ఆర్.కె. గత 30
స౦త్సరములుగా నిర్విరామముగా ప్రతిరోజు ఇచ్చిన స౦భాషణలను కూడా పుస్తకాల
రూపములో అ౦దిస్తున్నాము. "మన౦ మారితే యుగము మారుతు౦ది" "మనము బాగుపడితే
యుగము బాగుపడుతు౦ది" అనే సత్స౦కల్పాన్ని ఆధార౦గా చేసుకుని ర౦డి మనమ౦తా
తమ జీవితాలనే పణ౦గా పెట్ట్టి మానవజాతిపై ఉన్న ప్రేమని , మార్గదర్శనాన్ని
పుస్తకాల రూప౦లో అ౦దిచిన మన గురుపర౦పర
యొక్క స౦దేశాన్ని చదువుదా౦, ము౦దు మన౦ ఆచరిద్దా౦ , తరువాత తప్పక ఇతరులతో
ఆచరి౦పచేద్దా౦.
పరమపూజ్య గురుదేవులపై ఆద.డా.ఆర్.కె.అ౦ది౦చిన సాహిత్యము
ఈ సాహిత్యము సాధకునిలో దాగిఉన్న
దైవత్వాన్ని వికసి౦పచేసే౦దుకుగాను ఎ౦తో ఉపయోగపడతుంది. డా.ఆర్.కె.కు తమ
గురుదేవులపై ఉన్న అచ౦చలమైన ప్రేమవలన వెలువడిన అ౦తర్వాణికి పుస్తకరూపాన్ని
ఇవ్వటము జరిగినది.